నెల్లూరు, ఫిబ్రవరి 18: విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దర్గామిట్ట ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ నివేదికపై ప్రజా విచారణ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 పాఠశాలలో తనిఖీలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ గోగుల రమణయ్య పాఠశాల నిధుల వినియోగం, మౌలిక వసతులు, హాజరు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష జరిగిందన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున, స్టేట్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు పాల్గొని లోపాలను సవరించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

దర్గామిట్ట పాఠశాలలో సామాజిక తనిఖీపై ప్రజా విచారణ
నెల్లూరు, ఫిబ్రవరి 18: విద్యాశాఖ–సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో దర్గామిట్ట ఉన్నత పాఠశాలలో సామాజిక తనిఖీ నివేదికపై ప్రజా విచారణ నిర్వహించారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ డి. వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ, కేంద్ర మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ పాఠశాలలో సోషల్ ఆడిట్ నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలో ఎంపిక చేసిన 56 పాఠశాలలో తనిఖీలు పూర్తయ్యాయని పేర్కొన్నారు. కమ్యూనిటీ మొబిలైజేషన్ ఆఫీసర్ గోగుల రమణయ్య పాఠశాల నిధుల వినియోగం, మౌలిక వసతులు, హాజరు, మధ్యాహ్న భోజనం తదితర అంశాలపై సమీక్ష జరిగిందన్నారు. ప్లానింగ్ కోఆర్డినేటర్ ఆర్. మల్లికార్జున, స్టేట్ రిసోర్స్ పర్సన్ సుబ్బారావు పాల్గొని లోపాలను సవరించి పాఠశాలల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు.

