దుబాయ్ ( పున్నమి ప్రతినిధి)
తొలి రోజు వివిధ పారిశ్రామిక వేత్తలతో కొనసాగుతున్న సీఎం చంద్రబాబు భేటీలు.
ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ఛైర్మన్ రమేష్ ఎస్ రామకృష్ణన్, బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఛైర్మన్ షంషీర్ వయాలిల్ తో ముఖ్యమంత్రి వరుస సమావేశాలు.
దుగరాజపట్నం పోర్టులో షిప్ బిల్డింగ్ యూనిట్ నిర్మాణంలో భాగస్వాములు కావాలని కోరిన సీఎం చంద్రబాబు… ఆసక్తి కనబర్చిన ట్రాన్స్ వరల్డ్ గ్రూప్.
సుదీర్ఘ తీర ప్రాంతం ఉందని… లాజిస్టిక్స్ వ్యయం తగ్గించాలనే ఆలోచనలతో ఉన్నామని వివరించిన సీఎం.
రాష్ట్రంలో త్వరలో మూలపేట, రామాయపట్నం, మచిలీపట్నం పోర్టులు అందుబాటులోకి రానున్నట్టు వివరించిన సీఎం.
రైలు, పోర్టులు, ఎయిర్ పోర్టుల కనెక్టివిటీ ఉండేలా ప్రణాళికలు రూపొందించుకుంటున్నట్టు ట్రాన్స్ వరల్డ్ గ్రూప్ ప్రతినిధులకు చెప్పిన ముఖ్యమంత్రి.
వైద్యారోగ్య రంగంలో పెట్టుబడుల పెట్టేందుకు బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్ ఆసక్తి.
తిరుపతిలో స్పెషల్ క్యాన్సర్ సెంటర్ నిర్మాణానికి ముందుకు వచ్చిన బుర్జిల్.
వైద్యారోగ్య రంగంలో ప్రివెంటివ్-క్యూరేటీవ్ అనే విధానాన్ని అవలంభిస్తున్నట్టు చెప్పిన ముఖ్యమంత్రి.
ఇప్పటికే రాష్ట్రంలో హెల్త్ కార్డుల డిజటలీకరణ ప్రాజెక్టును పైలెట్ గా చేపట్టినట్టు వివరించిన చంద్రబాబు.
వైద్యారోగ్య రంగంలో రీసెర్చ్ అండ్ ఎడ్యుకేషన్ పై అనుభవం కలిగిన బుర్జిల్ హెల్త్ కేర్ హోల్డింగ్స్.
అబుదాబిలో అతి పెద్ద క్యాన్సర్ ఆస్పత్రిని నిర్వహిస్తున్న బుర్జిల్ సంస్థ.

