*తెలంగాణ రాజ్యాధికార పార్టీ గ్రామాలలో విస్తరణ*
పున్నమి న్యూస్
03 ఫిబ్రవరి 2026
తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న (ఎం.ఎల్.సి.) ఆదేశాల మేరకు, రాష్ట్రంలో పార్టీని రాష్ట్రస్థాయి నుండి గ్రామాలలోకి వేగవంతంగా విస్తరించే దిశగా రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్ సూచనలతో, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడిగా కుకునూరు అరవింద్ చారి ,
ప్రధాన కార్యదర్శిగా రాచ కొండ హరీష్ ,
ఉపాధ్యక్షుడిగా నాంపల్లి సురేష్ ,
ఉపాధ్యక్షుడుగా రాచకొండ నవీన్,
సోషల్ మీడియా ఇన్చార్జిగా మునుగు సంజీవ్ కుమార్ ను నియమించడం జరిగింది.
అలాగే అబ్దుల్లాపూర్మెట్ మండల ప్రధాన కార్యదర్శిగా సత్యం చారి నియమించారు.
ఈ సందర్భంగా నియమితులైన వారందరికీ తెలంగాణ రాజ్యాధికార పార్టీ అధ్యక్షులు తీన్మార్ మల్లన్న ఎమ్మెల్సీ తమ చేతుల మీదుగా నియామక పత్రాలు అందజేశారు.
ఈ కార్యక్రమంలో టి ఆర్ పి రాష్ట్ర యువజన అధ్యక్షులు బొడ్డుపల్లి చంద్రశేఖర్, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు పాకాల నరసింహ, కుక్కునూరు అరవింద్, రాచకొండ హరీష్, నాంపల్లి సురేష్, రాచకొండ నవీన్ తదితరులు పాల్గొన్నారు



