పున్నమి ప్రతి నిధి
హైదరాబాద్
తెలంగాణ క్రికెట్ అసోసియేషన్ (TCA) కొత్త గవర్నింగ్ బోర్డు మరియు ఎగ్జిక్యూటివ్ కమిటీని 2025 హైదరాబాద్లో అధికారికంగా ప్రకటించింది. 2025 నుండి 2028 వరకు మూడు సంవత్సరాల కాలానికి ఈ నూతన బోర్డు బాధ్యతలు స్వీకరించనుంది. క్రికెట్ అభివృద్ధికి అనుభవజ్ఞులు, నూతన ప్రతినిధులు, మరియు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జోన్ల సమతుల్యతను ప్రతిబింబించే విధంగా కమిటీలు ఏర్పాటు చేశారు.
బోర్డు ఆఫ్ పేట్రన్స్గా బండి సంజయ్ కుమార్, కొండా విశ్వేశ్వర్ రెడ్డి, ఎన్. రామ్ చంద్ర రావు, మరియు వెదిరే శ్రీరామ్ ఉన్నారు. బోర్డు ఆఫ్ అడ్వైజరీలో బందారు దత్తాత్రేయ, ఐ. గోపాల్ శర్మ, న్యాయమూర్తులు బి.ఎస్. రెడ్డి (రిటైర్డ్), సాద్ బిన్ జంగ్, సి.వి. రాములు (రిటైర్డ్) ఉన్నారు.
గవర్నింగ్ కౌన్సిల్ చైర్పర్సన్గా డీకే అరుణ, కో-చైర్గా వై. లక్ష్మీనారాయణ, వైస్ చైర్మన్గా నూనే బాల్రాజ్ నియమితులయ్యారు. మేనేజింగ్ కమిటీలో అధ్యక్షుడిగా బీబీ పాటిల్, ఉపాధ్యక్షుడిగా డాక్టర్ పి. విజయ్ చందర్ రెడ్డి, జనరల్ సెక్రటరీగా ధరం గురువా రెడ్డి, ట్రెజరర్గా డాక్టర్ తేగల హరినాథ్ రెడ్డి, జాయింట్ సెక్రటరీగా ప్రవీణ్ అద్మాలా ఉన్నారు.
అదనంగా, ఎం.సి. మెంబర్లుగా కాల్. ఏ. ప్రకాశ్ కుమార్, బద్దం మహిపాల్ రెడ్డి, అంబర్ అబ్బాస్ (మెన్స్ క్రికెటర్), పి. ఝాన్సీ లక్ష్మి (విమెన్ క్రికెటర్) ఎంపికయ్యారు.
గవర్నింగ్ కౌన్సిల్, జోనల్, కోచెస్, మీడియా, టెక్నికల్, గ్రౌండ్స్ అండ్ టోర్నమెంట్స్ కమిటీలను కూడా ప్రకటించారు. ఈ కమిటీలలో దేవకీ వాసుదేవరావు, కపిలవాయి రవీందర్, పరవేజ్ హసన్ అబ్బాస్, ఈ. వరుణ్ రెడ్డి తదితరులు ఉన్నారు.
తెలంగాణలో క్రికెట్కు కొత్త ఊపును, యువ ఆటగాళ్లకు మంచి అవకాశాలను తీసుకురావడమే ఈ నూతన బోర్డు లక్ష్యమని జనరల్ సెక్రటరీ ధరం గురువా రెడ్డి తెలిపారు.


