Saturday, 4 April 2026
  • Home  
  • తృటిలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ సిబ్బంది ప్రాణాలు తీయబోయిన ఆకతాయిలు!
- తిరుపతి

తృటిలో తప్పిన పెను ప్రమాదం: విద్యుత్ సిబ్బంది ప్రాణాలు తీయబోయిన ఆకతాయిలు!

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని స్థానిక దక్షిణ కైలాస్ నగర్ కాలనీలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బంది ప్రాణాలు ఆకతాయిల నిర్వాకం వల్ల గాల్లో దీపాల్లా మారాయి. అమరావతి వీధిలో లో-వోల్టేజ్ సమస్యతో వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులను గమనించిన విద్యుత్ సిబ్బంది, సమాచారం అందిన వెంటనే స్పందించి మరమ్మతులకు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసి (ఆఫ్ చేసి), ఇద్దరు లైన్ మెన్లు పోల్ ఎక్కి వైర్లను సరిచేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అక్కడికి వచ్చి, సిబ్బంది పోల్‌పై ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా మొండిగా ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా లైన్లోకి విద్యుత్ ప్రవహించింది. అప్రమత్తంగా ఉన్న లైన్ మెన్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య పనులు పునరావృతం కాకుండా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

శ్రీకాళహస్తి, ఏప్రిల్ 04 (పున్నమి న్యూస్): శ్రీకాళహస్తి పట్టణ సమీపంలోని స్థానిక దక్షిణ కైలాస్ నగర్ కాలనీలో పెను ప్రమాదం తృటిలో తప్పింది. విధి నిర్వహణలో ఉన్న విద్యుత్ సిబ్బంది ప్రాణాలు ఆకతాయిల నిర్వాకం వల్ల గాల్లో దీపాల్లా మారాయి. అమరావతి వీధిలో లో-వోల్టేజ్ సమస్యతో వృద్ధులు, చిన్నపిల్లలు పడుతున్న ఇబ్బందులను గమనించిన విద్యుత్ సిబ్బంది, సమాచారం అందిన వెంటనే స్పందించి మరమ్మతులకు చేపట్టారు. ముందస్తు జాగ్రత్తగా ట్రాన్స్‌ఫార్మర్ వద్ద విద్యుత్ సరఫరా నిలిపివేసి (ఆఫ్ చేసి), ఇద్దరు లైన్ మెన్లు పోల్ ఎక్కి వైర్లను సరిచేస్తుండగా ఈ దారుణం చోటుచేసుకుంది. ఇతర ప్రాంతాలకు చెందిన ఇద్దరు వ్యక్తులు మద్యం మత్తులో అక్కడికి వచ్చి, సిబ్బంది పోల్‌పై ఉన్నారన్న స్పృహ కూడా లేకుండా మొండిగా ట్రాన్స్‌ఫార్మర్ ఆన్ చేశారు. దీంతో ఒక్కసారిగా లైన్లోకి విద్యుత్ ప్రవహించింది. అప్రమత్తంగా ఉన్న లైన్ మెన్లు చాకచక్యంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. మద్యం మత్తులో ఇతరుల ప్రాణాలతో చెలగాటమాడిన ఆ ఇద్దరు వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని కాలనీ వాసులు డిమాండ్ చేస్తున్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్య పనులు పునరావృతం కాకుండా పోలీసులు, విద్యుత్ శాఖ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.