గొపాలపురం నియోజకవర్గం
పున్నమి న్యూస్✍️రెడ్డిసత్యసుబ్రహ్మణ్యం
సీనియర్ రిపోర్టర్
9989086083
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం లోని శార్వాణి ఇంగ్లీష్ మీడియం స్కూల్ లో ప్రజాసంకల్ప వేదిక తూర్పు గోదావరి జిల్లా రివ్యూ మీటింగ్ జిల్లా ఇంఛార్జి ఎస్ ఎమ్ భాషా గారి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది, ఈ మీటింగులో ఆర్టీఐ కార్యకర్తలు నిర్వహించవలసిన విషయాల గురించి మరియు సంస్థ ఆశయాలను ఆచరణలో పెట్టడానికి చెయ్యవలసిన కర్తవ్యాలు గురించి చర్చించడం జరిగింది, మరియు స్థానికులకు ఆర్టీఐ చట్టం గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మోటివేషనల్ స్పీకర్ రాబర్ట్ రవిచంద్ర గారిని గెస్ట్ గా పిలవడం జరిగింది, ఆయన సమావేశాన్ని ఉద్దేశించి అనేక విషయాలు వివరిoచారు. ఈ కార్యక్రమానికి psv ఆర్టీఐ కమిటీ తూర్పుగోదావరి జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు కోదాటి శ్రీనివాస్, వైస్ ప్రెసిడెంట్ యాకూబ్ గారు, వైస్ ప్రెసిడెంట్2 ముల్లా శేఖర్ గారు, మరియు జిల్లా కమిటీ అడ్వైజరు వడ్డి నరేష్ గారూ, అడ్వైజరు కార్యక్రమం నిర్వాహక కార్యదర్శి రెడ్డి సత్య సుబ్రహ్మణ్య శర్మ గారు, మరియు సంస్థ సభ్యులు, సుమారు ఇరవై అయిదు మంది సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని జయప్రదం చేసారు, కార్యక్రమం లో కొంతమందికి ఐడి కార్డు లు అపాయింట్ మెంట్ లెటర్స్, స్టిక్కర్లు ప్రదానం చెయ్యడం జరిగింది


