*బోనాల పండుగలో ఎమ్మేల్యే*
పున్నమి ప్రతినిధి సెప్టెంబర్ 10
నాగర్ కర్నూల్ మండలం తూడుకుర్తి గ్రామంలో జరిగిన బోనాల పండుగ సందర్భంగా ఎమ్మేల్యే డా. కూచుకుళ్ళ రాజేష్ రెడ్డి గారు ముఖ్య అతిథిగా హాజరవ్వడం జరిగింది.
ఎమ్మేల్యే గారి సొంత ఊరు కావడంతో ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనడం జరిగింది. మహిళలు బోనాలు ఎత్తుకొని ఊర్లో మర్రి చెట్టు నుంచి చెరువు కట్ట దగ్గర ఉన్న అమ్మ వారి దేవాలయం వరకు ర్యాలీగా బోనాలతో రావడం జరిగింది వారితో పాటు ఎమ్మేల్యే గారు కూడా పాల్గొనడం జరిగింది.
ఎమ్మేల్యే గారితో పాటు వ్యవసాయ మార్కెట్ కమిటీ ఛైర్మన్ రమణరావు గారు, మండల కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, గ్రామ పెద్దలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.


