*తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యావసర వస్తువులను మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును అందజేసిన ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
తుఫాన్ ప్రభావంతో పునరావాస కేంద్రంలో ఉన్న ప్రజలకు నిత్యా వసర వస్తువులను మరియు తక్షణ ఆర్థిక సహాయం కింద నగదును దక్షిణ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు టర్నర్ చౌట్రీ వద్ద గల ఎమ్మార్వో కార్యాలయంలో అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం తుఫాను ప్రభావం అధికంగా లేకుండా ముందస్తు జాగ్రత్తలు చేపట్టాలని తెలిపారు. అధికారులు, ప్రజాప్రతినిధులు, స్థానిక నేతల సమన్వయంతో తుఫాను సమర్థవంతంగా ఎదుర్కొన్నామని తెలియజేశారు. గౌరవ ప్రధాని మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు, ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబునాయుడు గారు ,ఉపముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు మరియు ఇతర ఉన్నతాధికారులు సమర్థవంతంగా పనిచేసారని ,తుఫాను నుంచి ప్రజలను రక్షించారని తెలిపారు . నష్టపోయిన ప్రతి కుటుంబానికి ప్రణాళిక బద్దంగా సహాయ సహకారాలు అందించిన ఘనత కూటమి ప్రభుత్వానీదని ఈ సందర్భంగా తెలిపారు. తుఫాను ప్రభావానికి గురైన మత్స్యకారులకు 50 కేజీల బియ్యంతో పాటు ఆరు రకాల ఆరు రకాల నిత్యావసర వస్తువులు పంపిణీ కార్యక్రమం చేపడతామని తెలిపారు. కార్యక్రమంలో స్థానిక ఎమ్మార్వో శ్రీ లచ్చన్న పాత్రుడు కూటమి నేతలు శ్రీ శివప్రసాద్ రెడ్డి గారు, శ్రీ మాసిపోక రాజుగారు ,శ్రీ జి కే గారు ,శ్రీ శివ గణేష్ గారు, శ్రీమతి రాజేశ్వరి గారు, శ్రీ రాజు గారు, శ్రీ కుమార్ గారు, శ్రీమతి యజ్ఞశ్రీ గారు ప్రభుత్వ అధికారులు ఏ ఎస్ ఓ శ్రీహరి గారు ఇతర అధికారులు పాల్గొన్నారు


