కృష్ణా జిల్లా ఎస్పీ శ్రీ వి. విద్యా సాగర్ నాయుడు, ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు, మొంధా తుఫాన్ నేపథ్యంలో బందర్ డీఎస్పీ CH. రాజా గారు గారు నాగాయలంక పరిధిలోని సంగమేశ్వరం గ్రామంలోని రీహాబిలిటేషన్ సెంటర్ను సందర్శించి, అక్కడ ఏర్పాటు చేసిన సదుపాయాలను పరిశీలించారు.
తదనంతరం ఏటిమొగ్గ – ఎదురుమొండి ఫెర్రీ (పంటు) ప్రాంతాన్ని సందర్శించి, అక్కడి పరిస్థితులను సమీక్షించారు. తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే చర్యలను అధికారులు పర్యవేక్షించారు.
ఈ సందర్భంగా ప్రజలకు అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలని, అవసరమైతే సమీపంలోని పునరావాస కేంద్రాలకు తరలించుకోవాలని సూచించారు.
Andhra Pradesh Police


