ఇటీవల తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రత్తి, మొక్కజొన్న, పెసలు వంటి పంటలను రైతు వారీగానమోదు చేసి, తగిన పరిహారం అందించేం దుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగు మారిన వరినీ సైతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా స్పష్టమైన సూచనలు ఇచ్చారు.
రైతులు మార్క్ఫెడ్ ద్వారా పెసలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న కొనుగోలు త్వరిత గతిన ప్రారంభించాలన్న అభ్యర్థ నపై ఆమె సానుకూలంగా స్పందించారు. దీనిపైవ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు తో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి రైతు పక్కన నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు.

తుఫాను ప్రభావిత రైతులకు అండగా ప్రభుత్వం — నష్టాలపై సమీక్ష చేసిన ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య
ఇటీవల తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న నష్టాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, నందిగామ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య వ్యవసాయ శాఖ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, తుఫాను ప్రభావంతో దెబ్బతిన్న ప్రత్తి, మొక్కజొన్న, పెసలు వంటి పంటలను రైతు వారీగానమోదు చేసి, తగిన పరిహారం అందించేం దుకు వేగవంతమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రంగు మారిన వరినీ సైతం ప్రభుత్వం కొనుగోలు చేసేలా స్పష్టమైన సూచనలు ఇచ్చారు. రైతులు మార్క్ఫెడ్ ద్వారా పెసలు, రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మొక్కజొన్న కొనుగోలు త్వరిత గతిన ప్రారంభించాలన్న అభ్యర్థ నపై ఆమె సానుకూలంగా స్పందించారు. దీనిపైవ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్న నాయుడు తో ఫోన్ ద్వారా మాట్లాడి, రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వం తుఫాను ప్రభావంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి రైతు పక్కన నిలుస్తుందని ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య హామీ ఇచ్చారు.

