తొట్టంబేడు అక్టోబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు, తొట్టంబేడు మండల పరిధిలో గ్రామాల్లోని రైతులు మొంథా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి మండల మాజీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ…గ్రామస్తులకు అతి ముఖ్యమైన సుచనలు కొన్ని పాటించాలన్నారు. పొలాల దగ్గరికి, కరెంటు ట్రాన్స్ఫర్లు దగ్గరకు , చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని, తొట్టంబేడు మండలంలో తెలుగు గంగ కాలవలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థినీ , విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయంలోని అధికారులందరూ సమస్యలు ఎక్కడ ఉన్న మండల రెవెన్యూ ఆఫీసర్ వారికి, మండల ప్రజా పరిషత్ అధికారులకు తెలియజేయాలని, గ్రామాలలో ఉండేటటువంటి నాయకులు, మండల నాయకులకు గ్రామాలలో జరిగే సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, టిడిపి మండల మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు మండల ప్రజలను కోరారు.

తుఫాను పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలీ…. టిడిపి మాజీ మండలాధ్యక్షులు
తొట్టంబేడు అక్టోబర్ 27, పున్నమి న్యూస్: శ్రీకాళహస్తి నియోజకవర్గ శాసనసభ్యులు బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి సూచనల మేరకు, తొట్టంబేడు మండల పరిధిలో గ్రామాల్లోని రైతులు మొంథా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలని టిడిపి మండల మాజీ అధ్యక్షులు గాలి మురళి నాయుడు ప్రకటన ద్వారా ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ…గ్రామస్తులకు అతి ముఖ్యమైన సుచనలు కొన్ని పాటించాలన్నారు. పొలాల దగ్గరికి, కరెంటు ట్రాన్స్ఫర్లు దగ్గరకు , చెట్ల కిందకు వెళ్లకుండా ఉండాలని, తొట్టంబేడు మండలంలో తెలుగు గంగ కాలవలో నీటి ఉధృతి ఎక్కువగా ఉండడంతో విద్యార్థినీ , విద్యార్థుల పట్ల తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలన్నారు. సచివాలయంలోని అధికారులందరూ సమస్యలు ఎక్కడ ఉన్న మండల రెవెన్యూ ఆఫీసర్ వారికి, మండల ప్రజా పరిషత్ అధికారులకు తెలియజేయాలని, గ్రామాలలో ఉండేటటువంటి నాయకులు, మండల నాయకులకు గ్రామాలలో జరిగే సమస్యలను ఎప్పటికప్పుడు తెలియజేయాలని, టిడిపి మండల మాజీ అధ్యక్షులు, పార్టీ సీనియర్ నాయకులు గాలి మురళి నాయుడు మండల ప్రజలను కోరారు.

