అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి )
జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులోని తుంగభద్ర నదిలో ఆదివారం మొసలి కలకలం రేపింది. తుంగభద్ర నది తీరాన మొసలి వ్యవసాయ పొలాల వైపు వస్తున్నట్లు స్థానికులు గమనించి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొన్నది. తుంగభద్రా నదికి కర్ణాటక రాష్ట్రం నుంచి కురుస్తున్న వర్షాలకు వరదనీరు రావడంతో మొసల్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి మొసలిని పట్టుకుని గ్రామస్తుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

తుంగభద్ర నది తీరాన ముసలి కలకలం.
అలంపూర్ : ఆగస్టు 17 ( పున్నమి ప్రతినిధి ) జోగులాంబ గద్వాల జిల్లా, ఉండవల్లి మండలం పుల్లూరు గ్రామ శివారులోని తుంగభద్ర నదిలో ఆదివారం మొసలి కలకలం రేపింది. తుంగభద్ర నది తీరాన మొసలి వ్యవసాయ పొలాల వైపు వస్తున్నట్లు స్థానికులు గమనించి ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో గ్రామంలో అలజడి నెలకొన్నది. తుంగభద్రా నదికి కర్ణాటక రాష్ట్రం నుంచి కురుస్తున్న వర్షాలకు వరదనీరు రావడంతో మొసల్లు వస్తున్నట్లు గ్రామస్తులు తెలిపారు. అధికారులు తక్షణం స్పందించి మొసలిని పట్టుకుని గ్రామస్తుల్లో నెలకొన్న భయాన్ని తొలగించాలని ప్రజలు కోరుతున్నారు.

