*తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అరెస్ట్
అమరావతి(పున్నమి ప్రతినిధి)
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసులో కీలక నిందితుడు అజయ్కుమార్ సుగంధ్ (A16)ను సిట్ అరెస్ట్ చేసింది.
ఆయన మోన్ గ్రీజరాయిడ్స్, అసటిక్ యాసిడ్ యాస్టర్ వంటి రసాయనాలను బోలేబాబా కంపెనీకి సరఫరా చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
సిట్ నివేదిక ప్రకారం,
లడ్డూల తయారీలో ఉపయోగించిన నెయ్యిలో 90 శాతం పామాయిల్ కలిపినట్లు గుర్తించారు.
దీంతో సుగంధ్ను సిట్ అధికారులు అరెస్ట్ చేశారు.


