పున్నమి న్యూస్ (కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ: అయినవిల్లి మండలం క్రాప గ్రామానికి చెందిన చిక్కం లక్ష్మి ఇటీవల జరిగిన ఏపీ డీఎస్సీ-2025 పరీక్షలో స్కూల్ అసిస్టెంట్ హిందీ పండిట్ విభాగం లో జిల్లా లో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. అంతే కాకుండా తాను చదువుకున్న కె.జగన్నాధపురం జిల్లా పరిషత్ హైస్కూల్ లోనే పోస్టింగ్ దక్కించుకోవడం విశేషం. తాను చదువుకున్న క్లాస్ రూమ్ లోనే తను విద్యార్ధులకు పాఠాలు చెప్పనుంది. దీంతో లక్ష్మి కి ఉపాధ్యాయులు, గ్రామస్తులు, కుటుంబసభ్యులు అభినందనలు తెలిపారు. ఆమె విద్యార్ధులకు స్ఫూర్తిదాయకం అన్నారు.


