తాడేపల్లిలో శ్రీ వైయస్ జగన్ను కలిసిన డీఎస్సీ 2025 అభ్యర్ధులు
డీఎస్సీ 2025లో తమకు అన్యాయం జరిగిందని పలువురు అభ్యర్ధులు తాడేపల్లిలో మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధినేత వైయస్ జగన్ను కలిసి తమ గోడు విన్నవించుకున్నారు. మెగా డీఎస్సీ పేరుతో తమను కూటమి ప్రభుత్వం దగా చేసిందని వారు వాపోయారు. మెరిట్ను విస్మరించి రాజ్యాంగ విరుద్దంగా ప్రభుత్వం వ్యవహరించిందని, తమకు న్యాయం చేయాలని వారంతా వైయస్ జగన్ను కోరారు.


