వింజమూరు మండలం, చండ్రపడియ పంచాయితీ పరిధిలోని తొగటపాలెం గ్రామంలో జరిగిన తమిదల కుటుంబ వివాహ వేడుకల్లో గౌరవ ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ కాకర్ల సురేష్ గారు పాల్గొన్నారు. తమిదల విజయ భాస్కర్ రెడ్డి – శ్రీమతి అనిత దంపతుల కుమారుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి గంధపు నలుగు కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే, వరుడికి అక్షింతలు వేసి ఆశీర్వదించి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో ఆప్యాయంగా ముచ్చటిస్తూ, వారి ఆనందంలో పాలుపంచుకున్నారు. వరుడు ప్రశాంత్ కుమార్ రెడ్డి భవిష్యత్తులో సుఖసంతోషాలతో, అష్టైశ్వర్యాలతో ఎదగాలని, వివాహ జీవితం ఆనందంగా కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఆశీస్సులు అందించారు.
ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు, గ్రామస్థులు పెద్ద సంఖ్యలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.



