వనస్థలిపురంలో, శివసింధూ హైస్కూల్, ప్రభుత్వ గుర్తింపు కలిగిన పాఠశాల
చైర్మన్ ప్రశాంత్ లక్కరాజు
పున్నమి: ప్రతినిధి దూపం అంజనేయులు: వనస్థలిపురం, శివసింధూ హైస్కూల్, తక్కువ ఫీజులతో కార్పొరేట్ స్థాయి విద్యనందించడమే తమ పాఠశాల లక్ష్యమని శివసింధూ హైస్కూల్ యజమాన్యం, చైర్మన్ ప్రశాంత్ లక్కరాజు తెలిపారు. వినాయక చవితి సందర్భంగా ఆయన మాట్లాడారు. అందరికీ నాణ్యమైన విద్యను అందించడానికి ప్రైమరీ విద్యతో ఆరంభించి అంచలంచెలుగా హై స్కూల్ స్టాయికి ఎదిగిందన్నారు. హైదరాబాద్, వనస్థలిపురం, విజయపూరి కాలని, లో శివసింధూ హైస్కూల్ విద్యార్థులను ఆకర్షించి నంబర్ వన్ పాఠశాలగా అభివృద్ధి చెందిందన్నారు. విద్యార్థులను క్రీడల్లో ప్రోత్సహించేందుకు క్రీడలు, సంగీతం, డాన్స్, భగవద్గీత, దసరా, ఉగాది, దీపావళి, బోనాల పండుగ, క్రిస్మస్, రంజాన్, బక్రీద్ లాంటి పండుగలను కూడా భారతదేశ గౌరవించదగ్గ విద్యార్థి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. కరాటి శిక్షణ ఇస్తున్నామన్నారు. పదో తరగతి విద్యార్థులపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకుని సాయంత్ర వేళల్లో ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామన్నారు. హైస్కూల్ ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకూ ప్రతి సంవత్సరమూ 10వ తరగతి విద్యార్థులు నూరు శాతం ఉత్తీర్ణత సాధిస్తున్నారన్నారు. జిల్లా, మండల స్థాయిలో మొదటి, రెండో స్థానం సాధిస్తున్నారన్నారు. ఈ ఏడాది పదో తరగతి ఫలితాల్లో శివ సింధూ హైస్కూల్ విద్యార్థులు విద్యార్థినిలు విజయదుందుభి మోగించారని తెలిపారు. ప్రథమ స్థానం ఫాతిమా జాహోర, ద్వితీయ స్థానం అమనగంటి అక్షిత, పదో తరగతిలో ప్రతి ఒక్కరు 100% విజయం సాధించారని తెలిపారు, వారి విజయానికి శివసింధూ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, టీచర్స్, కృషి ఎంతో ఉందన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యనందిస్తున్నామన్నారు.


