పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, బంతి కోసం బాలుడు తండ్రి గుడ్స్ వాహనం (అశోక లీ ల్యాండ్) చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం, రామన్నపేట గ్రామానికి చెందిన కల్లెం నరేష్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని లాష్కర్ గూడ రోడ్డులో ఉంటూ గుడ్స్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం లాష్కర్ గూడ రోడ్డులో ఎస్ బి ఐ బ్యాంక్ ఎదురుగా నరేష్ గుడ్స్ వాహనాన్ని రివర్స్ తీస్తుండగా అతని కుమారుడు కల్లెం రోహిత్ (13 నెలల) బంతితో ఆడుతున్నప్పుడు ఆకస్మాత్తుగా గుడ్స్ వెనుక వైపు ఎడమ టైర్ కిందపడి తలకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఉస్మానియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.
తండ్రి ఆటో రివర్స్ చేస్తుండగా.. టైర్ల కిందపడి బాలుడి మృతి
పున్నమి: అబ్దుల్లాపూర్ మెంట్ మండలం రంగారెడ్డి జిల్లా, బంతి కోసం బాలుడు తండ్రి గుడ్స్ వాహనం (అశోక లీ ల్యాండ్) చక్రాల కింద పడి మృతి చెందిన ఘటన అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. యాదాద్రి భువనగిరి జిల్లా, మండలం, రామన్నపేట గ్రామానికి చెందిన కల్లెం నరేష్ రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్మెట్ మండల కేంద్రంలోని లాష్కర్ గూడ రోడ్డులో ఉంటూ గుడ్స్ వాహనం నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. కాగా సోమవారం ఉదయం లాష్కర్ గూడ రోడ్డులో ఎస్ బి ఐ బ్యాంక్ ఎదురుగా నరేష్ గుడ్స్ వాహనాన్ని రివర్స్ తీస్తుండగా అతని కుమారుడు కల్లెం రోహిత్ (13 నెలల) బంతితో ఆడుతున్నప్పుడు ఆకస్మాత్తుగా గుడ్స్ వెనుక వైపు ఎడమ టైర్ కిందపడి తలకు తీవ్ర రక్తస్రావం జరిగి అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని.. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాని ఉస్మానియా ఆసుపత్రి మార్చరీకి తరలించారు.

