గాజువాక సెప్టెంబర్ 3(పున్నమి ప్రతినిధి)
గాజువాక నియోజకవర్గం 87వ వార్డ్ పరిధిలో వడ్లపూడి బూత్ నెంబర్ 60 , కణితి అంబేద్కర్ కాలనీ బూత్ నంబర్ 70 మరియు డ్వాక్రా సంగం మహిళలతో రాష్ట్ర కార్యదర్శి స్థానిక వార్డ్ కార్పొరేటర్ బోండా జగన్నాధం (జగన్) ఆధ్వర్యంలో సూపర్ జీఎస్టీ – సూపర్ సేవింగ్స్ అవగాహనా సదస్సు ఎర్పాటు చేసారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మన దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సర్కార్ జీఎస్టీ తగ్గించడంతో.. దాని ప్రయోజనాలను రాష్ట్ర ప్రజలకు తెలియజెప్పాలని గౌరవ ముఖ్యమంత్రివర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు నిర్ణయించారని, కొన్ని వస్తువులపై ట్యాక్స్ తగ్గించడం వలన దేశ ప్రజలకు భారీగా ప్రయోజనం చేకూరుతుందన్నారు , ఈ కార్యక్రమంలో వార్డ్ అధ్యక్షుడు విజయరామరాజు, పొలరావు, ఆదినారాయణ,వాసు, పద్మ,సురేష్, సీఈవో భాను, మహిళలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.


