
మెఘా డీఎస్సీ నియామకాల్లో మెరిట్ సాధించిన ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులను రిజర్వేషన్ కేటగిరీకి దించి రిజర్వేషన్ సీట్లలో కోత విధించడo రాజ్యాంగ విరుద్ధం.. అని మెరిట్ సాధించిన వారిని ఓపెన్ కేటగిరీ లోనే లెక్కించాలని విదసం (విస్తృత దళిత సంఘాల)ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ డాక్టర్ బూసి వెంకట రావు డిమాండు చేసారు..
డీఎస్సీ లో మెరిట్ సాధించిన వారిని రిజర్వేషన్ లో పెట్టడం వల్ల రిజర్వేషన్ పోస్టులు తగ్గిపోయి ర్యాంకులు పొందిన వందల సంఖ్య లో ఎస్సీ ఎస్టీ బీసీ లు అర్హత కోల్పోయారని ఈ తప్పిదాలు సరిదిద్ది న్యాయం చేయాలని విదసం ఆధ్వర్యంలో ఈ రోజు విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు..
ఈ సందర్భంగా వెంకట రావు మాట్లాడుతూ డీఎస్సీ నోటిఫికేషన్ లో రిజర్వేషన్ అమలుకోసం 2023 జీవో 77 రూల్స్ ప్రకారం నియామకం ఉంటుందని చెప్పిన ప్రభుత్వం ఆ జీవో లో పొందుపరచిన 2 వక్లాజు విస్మరించిదన్నారు .. ఎస్సీ ఎస్టీ బీసీ ews వారు ఎవరైనా కటా ప్ మార్కులు దాటి మెరిట్ సాధిస్తే వారిని రిజర్వేషన్ కోటాలో లెక్కించ కూడదు అని స్పష్టంగా ఉన్నప్పటికీ మెరిట్ ర్యాంకులు పొందిన అనేక మంది ఎస్సీ ఎస్టీ బీసీ లను రిజర్వేషన్ లో లెక్కించి సుప్రీంకోర్టు తీర్పు లను సైతం ఉల్లంఘించారని విమర్శించారు. ప్రభుత్వo వెంటనే ఈ తప్పిదాలను సరిదిద్ది మెరిట్ వారిని ఓపెన్ కేటగిరి లో ఉంచి వర్టికల్ రిజర్వేషన్ల లో రాజ్యాంగ ఇచ్చిన కోటాను నిపాలని డిమాండ్ చేశారు…
బూ ల భాస్కర రావు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం , విజయ నగరం, విశాఖ జిల్లా నుండి నష్టపోయిన అభ్యర్థుల వారి వారి ర్యాంకు కార్డులతో రుజువులు ను ఆర్ జె డి కార్యాలయం లో పిర్యాదు చేసారు..

