రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో జరిపిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల పోటీ పరీక్షలో ప్రతిరోజు గ్రంథాలయానికి విచ్చేసి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదువుకొని జీవశాస్త్రం ఉపాధ్యాయుడుగా జిల్లాలో 19వ ర్యాంకును సాధించిన రంగనాథను పలమనేరు గ్రంథాలయ అధికారి హేమ కుమార్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ గ్రంథాలయానికి రావటం వల్ల అనేకరకాల పోటీ పరీక్షల సంబంధించినటువంటి పుస్తకాలను చదివి ఈ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యాను. కావున ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువత గ్రంథాలయం ఉపయోగించుకుంటే విజయం మనదే అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో శ్రీపురం సీతారామయ్య తులసి నాదం నాయుడు విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి యుగంధర్ ఉమాపతి నాయుడు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయునికి సన్మానం
రాష్ట్ర ప్రభుత్వం 2025 సంవత్సరంలో జరిపిన మెగా డీఎస్సీ ఉపాధ్యాయుల పోటీ పరీక్షలో ప్రతిరోజు గ్రంథాలయానికి విచ్చేసి గ్రంథాలయంలో ఉన్న పుస్తకాలను చదువుకొని జీవశాస్త్రం ఉపాధ్యాయుడుగా జిల్లాలో 19వ ర్యాంకును సాధించిన రంగనాథను పలమనేరు గ్రంథాలయ అధికారి హేమ కుమార్ ఆదివారం సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఎంపికైన ఉపాధ్యాయుడు మాట్లాడుతూ గ్రంథాలయానికి రావటం వల్ల అనేకరకాల పోటీ పరీక్షల సంబంధించినటువంటి పుస్తకాలను చదివి ఈ పోటీ పరీక్షకు సంసిద్ధమయ్యాను. కావున ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగ యువత గ్రంథాలయం ఉపయోగించుకుంటే విజయం మనదే అని తెలిపాడు. ఈ కార్యక్రమంలో శ్రీపురం సీతారామయ్య తులసి నాదం నాయుడు విజయ్ కుమార్ ప్రధానోపాధ్యాయులు జొన్నవిత్తుల శ్రీరామచంద్రమూర్తి యుగంధర్ ఉమాపతి నాయుడు గ్రంథాలయ పాఠకులు పాల్గొన్నారు.

