రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి /పున్నమి ప్రతినిధి.
ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామంలో
ఇటుకలు ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో బురదలో చిక్కుకున్న బాధితుడిని 108 అంబులెన్స్ సిబ్బంది ధైర్యంగా కాపాడారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు
ఈ సందర్భంగా ప్రశాంత్ ఎలాంటి ప్రమాదాన్ని లెక్కచేయకుండా బాధితుడిని బయటకు తీసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రశాంత్ చూపిన ధైర్యసాహసం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు

ట్రాక్టర్ ప్రమాదం… బురదలో చిక్కుకున్న బాధితుడిని రక్షించిన 108 ఈఎంటి ప్రశాంత్
రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి /పున్నమి ప్రతినిధి. ముస్తాబాద్ మండలం లోని పోతుగల్ గ్రామంలో ఇటుకలు ఖాళీ చేసి తిరిగి వస్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటనలో బురదలో చిక్కుకున్న బాధితుడిని 108 అంబులెన్స్ సిబ్బంది ధైర్యంగా కాపాడారు. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న 108 సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించారు ఈ సందర్భంగా ప్రశాంత్ ఎలాంటి ప్రమాదాన్ని లెక్కచేయకుండా బాధితుడిని బయటకు తీసి ప్రాణాపాయం నుంచి రక్షించారు. అనంతరం ప్రమాదంలో గాయపడిన వారిని 108 అంబులెన్స్లో సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రశాంత్ చూపిన ధైర్యసాహసం పట్ల స్థానికులు అభినందనలు తెలిపారు

