శ్రీ దుర్గా మల్లేశ్వర సిద్దార్థ మహిళా కళాశాల లోని కంప్యూటర్ సైన్స్ విభాగం, స్వర్ణోత్సవ వేడుకలలో భాగంగా ” టెక్ స్పార్క్స్ – 2K25: వర్స్ ఆఫ్ టెక్నాలజీ • అనే రాష్ట్రస్థాయి సాంకేతిక కార్యక్రమమును 24 డిసెంబర్ 2025 న
కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వి. వి.ఎస్ కుమార్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వ హించారు.
ఈ కార్యక్రమం ఉదయం 10:30 గంటలకు వెబినార్ హాల్ లో ప్రారంభం అయ్యింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ప్రొఫెసర్ ఎస్. విజయ భాస్కర రావు గారు, వైస్- చైర్మన్, APSCHE మరియు వైస్-చాన్సలర్ (ఇన్ఛార్జ్), డా|| బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ వారు హాజరై విద్యార్థులను ఉద్దేశించి ప్రేరణాత్మక సందేశాన్ని ఇచ్చారు.
ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నవీన ఆలోచనలు మరియు నైపుణ్యాల ప్రాధాన్యతను మరియు విద్యార్థులను ఉద్దేశించి ప్రతి విద్యార్థి నూతన సమాజానికి IQ విశ్లేషణాత్మక సామర్ధానికే’ కాకుండా విద్యార్థి విజయానికి మాత్రమే రోషద పడుతుందని, మరియు EQఅనేది భావోద్వేగ మేధస్సును వృద్ధి చేస్తుందని ప్రతి విద్యార్థి బేరిక్షా వేసుకోవాలని విద్యార్థులకు దిశానిర్దేశం చేసారు. విద్యార్థులు జట్టుగా పనిచేయడం వల్ల విద్య మరియు వృత్తి జీవితాలలో విజయం సాధించడానికి సమిష్ట కృషి ఎంతో అవసరం అని అన్నారు. ఈ పోటీ ప్రపంచంలో తగిన ఉద్యోగ అవకాశాలు ఉండాలని (Employeebility) degree పూర్తయిన తరువాత ఉద్యోగం సాధించటం ఒక్కటే మీ గమ్యం కాదని, అక్కడ నుండి ఈ రెండు సమానంగాఉన్నత స్థానాలు అధి గమించటానికి డిగ్రీ ఎంట్రీ టికెట్ లాంటిదని, దీర్ఘకాలక విజయానికి ఇది ఒక సోపానమని చెప్పారు. విద్యార్థులు బాధ్యతగా, వృత్తి–పరులుగా మాత్రమే కాకుండా మంచి మనుషులుగా మారాలని తెలియజేసారు.
ఈ కార్యక్రమములో కళాశాల పిన్సిపాల్ డా|| వి. వి. సుబ్రమణ్య కుమార్ -గారు సమర్థవంతమైన నాయకత్వంతో నిర్వహించబడింది. విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడుతూ విద్యార్థులు ఇటువంటి Technical Events ద్వారా జట్టు సామధ్వం, వినూత్న భావాలను వ్యక్త పరుచుకునే ఏరస్పర ఆలోచనలను మార్చుకునే వేదికగా ఉపయోగ పడుతాయని మరియు నాయకత్వ లక్షణాలు వెలికి తీసే ఒక సోపానమని తెలియజేశారు.
టెక్ స్టోర్క్స్ – 2 K25 యొక్క ప్రధాన ఉద్దేశం విద్యార్థుల్లో సాంకేతిక నైపుణాలు, సృజనాత్మకత మరియు సమస్య పరిష్కార సామర్థ్యాన్ని STUD-WEBER, TECHNO-FIESTA, TECH BLIN-C, PREDICAMENT, SHORT FILM IREEL, INSIGNIA, GAME MINIATURE వంటి పలు పోటీలు నిర్వహించబడ్డాయి. రాష్ట్రంలోని వివిధ కళాశాలల నుండి 380 మంది విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గోని ఈ కార్యక్రమాన్ని అత్యంత ఉత్సాహభరితంగా మార్చారు. విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను అందించగా పాల్గొన్నప్రతి విద్యార్థికి సర్టిపికెట్లు అందించబడ్డాయి. ఈ కార్యక్రమం లో కంప్యూటర్ విభాగాధిపతి శ్రీమతి యం. ప్రవీణ,విభాగ అధ్యాపకులు… విద్యార్థులు పాల్గొన్నారు.


