ఉదయగిరి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులకు టీడీపీ 44వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు మాజీ శాసనసభ్యులు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు మరియు నెల్లూరు జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్పర్సన్, టీడీపీ రాష్ట్ర ఆర్గనైజింగ్ సెక్రటరీ మేకపాటి శాంతి కుమారి గారు.
ఈ సందర్భంగా వారు పార్టీ స్థాపకుల ఆశయాలను స్మరించుకుంటూ, పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని పిలుపునిచ్చారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీ అభివృద్ధికి కార్యకర్తల కృషి ఎంతో ముఖ్యమని పేర్కొన్నారు.
టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉదయగిరి నియోజకవర్గంలో పలు ప్రాంతాల్లో పార్టీ జెండా ఆవిష్కరణలు, కేక్ కటింగ్ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించబడుతున్నాయి. నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటూ పార్టీ పట్ల తమ అంకితభావాన్ని చాటుకుంటున్నారు.



