Thursday, 19 March 2026
  • Home  
  • టీడీపీ శ్రేణుల్లో విషాదం-పార్టీ సీనియర్ నేతల మృతి పట్ల బొజ్జల బృందమ్మ తీవ్ర సంతాపం
- తిరుపతి

టీడీపీ శ్రేణుల్లో విషాదం-పార్టీ సీనియర్ నేతల మృతి పట్ల బొజ్జల బృందమ్మ తీవ్ర సంతాపం

శ్రీకాళహస్తి,తొట్టంబేడు, (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీకి ఎంతో కాలంగా సేవలందించిన సీనియర్ నాయకులు కన్నుమూయడంతో నియోజకవర్గ నాయకురాలు బొజ్జల బృందమ్మ వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన సీనియర్ నేత చెత్తమ నాయుడు మృతి చెందడంతో, బృందమ్మ ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెత్తమ నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఒక అంకితభావం గల నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా, శ్రీకాళహస్తి పట్టణంలోని కంట వీధికి చెందిన కొట్టే సురేష్ అకాల మరణం పట్ల కూడా ఆమె సంతాపం ప్రకటించారు. సురేష్ నివాసానికి చేరుకున్న బృందమ్మ, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తమ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతులకు ఘన నివాళులర్పించారు.

శ్రీకాళహస్తి,తొట్టంబేడు, (పున్నమి న్యూస్) శ్రీకాళహస్తి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. పార్టీకి ఎంతో కాలంగా సేవలందించిన సీనియర్ నాయకులు కన్నుమూయడంతో నియోజకవర్గ నాయకురాలు బొజ్జల బృందమ్మ వారి కుటుంబాలను పరామర్శించి ధైర్యం చెప్పారు.తొట్టంబేడు మండలం పూడి గ్రామానికి చెందిన సీనియర్ నేత చెత్తమ నాయుడు మృతి చెందడంతో, బృందమ్మ ఆయన భౌతికకాయాన్ని దర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా చెత్తమ నాయుడుతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ ఆమె కన్నీరు పెట్టుకున్నారు. పార్టీకి ఒక అంకితభావం గల నేతను కోల్పోయామని ఆవేదన వ్యక్తం చేస్తూ, వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. అదేవిధంగా, శ్రీకాళహస్తి పట్టణంలోని కంట వీధికి చెందిన కొట్టే సురేష్ అకాల మరణం పట్ల కూడా ఆమె సంతాపం ప్రకటించారు. సురేష్ నివాసానికి చేరుకున్న బృందమ్మ, ఆయన భౌతికకాయానికి పూలమాల వేసి అంజలి ఘటించారు. అనంతరం వారి కుటుంబ సభ్యులతో మాట్లాడి, తమ కుటుంబం ఎల్లప్పుడూ వారికి అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని మృతులకు ఘన నివాళులర్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.