నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఈరోజు నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ క్రైస్తవ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కృపాకర్, మాజీ కౌన్సిలర్ దేవరపాటి రవికుమార్ దంపతులకు మరియు 38వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు కు మంత్రి ఫరూక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, పవిత్ర బైబిల్ గ్రంథంలోని “ప్రభువు వాక్యాన్ని” బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో సోదరభావాన్ని, శాంతిని పెంపొందించడంలో క్రైస్తవ పెద్దల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. తమను సాదరంగా ఆహ్వానించి, గౌరవించినందుకు క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలిపారు.

టిడిపి క్రైస్తవ నాయకులకు యేసుప్రభు వాక్యాన్ని బహుకరించిన మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్
నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ని ఈరోజు నంద్యాలలోని వారి క్యాంపు కార్యాలయం నందు తెలుగుదేశం పార్టీకి చెందిన ప్రముఖ క్రైస్తవ నాయకులు మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం మాజీ కౌన్సిలర్ కృపాకర్, మాజీ కౌన్సిలర్ దేవరపాటి రవికుమార్ దంపతులకు మరియు 38వ వార్డు టీడీపీ ఇంచార్జ్ తాటికొండ బుగ్గ రాముడు కు మంత్రి ఫరూక్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు, పవిత్ర బైబిల్ గ్రంథంలోని “ప్రభువు వాక్యాన్ని” బహుకరించారు ఈ సందర్భంగా మంత్రి ఫరూక్ మాట్లాడుతూ సమాజంలో సోదరభావాన్ని, శాంతిని పెంపొందించడంలో క్రైస్తవ పెద్దల పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు. కూటమి ప్రభుత్వం క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమానికి పెద్దపీట వేస్తుందని, నంద్యాల నియోజకవర్గ అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేస్తామని తెలిపారు. తమను సాదరంగా ఆహ్వానించి, గౌరవించినందుకు క్రైస్తవ నాయకులు మంత్రి ఫరూక్ కి కృతజ్ఞతలు తెలిపారు.

