Sunday, 7 December 2025
  • Home  
  • జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన… జిల్లా కలెక్టర్
- జోగులాంబ గద్వాల

జెడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయుడిని సస్పెండ్ చేసిన… జిల్లా కలెక్టర్

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి ) జోగులంబ గద్వాల జిల్లా, అయిజ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల (బాలుర)లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయములో విద్యార్థులందరూ ఇంటికి వెళ్లి ఉన్నారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ సెలవు కాదు. అధికారికంగా కూడా ఎటువంటి సెలవు లేదు. అయితే విద్యార్థులను అనుమతి లేకుండా ఇంటికి ఎందుకు పంపించారు, అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. దీనికి ఉపాధ్యాయులు, ఈ రోజు మాల పున్నమి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లారు అని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ప్రకటించని సెలవును మీరు ఎలా ఇస్తారు పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి బోధన పొందాలి. మీరు ప్రోత్సహించకపోతే విద్యార్థుల చదువు ఎక్కడ నేర్చుకుంటారు అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషపాణి శర్మను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ 100 శాతం హాజరుగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని ఆదిశగా కృషి చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ కుమార్ సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

అలంపూర్ : సెప్టెంబర్ 10 ( పున్నమి ప్రతినిధి )
జోగులంబ గద్వాల జిల్లా, అయిజ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ పాఠశాల (బాలుర)లో మంగళవారం జిల్లా కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేశారు. పాఠశాల సమయములో విద్యార్థులందరూ ఇంటికి వెళ్లి ఉన్నారు. దీనిపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఇది ప్రభుత్వ సెలవు కాదు. అధికారికంగా కూడా ఎటువంటి సెలవు లేదు. అయితే విద్యార్థులను అనుమతి లేకుండా ఇంటికి ఎందుకు పంపించారు, అని ఉపాధ్యాయులను ప్రశ్నించారు. దీనికి ఉపాధ్యాయులు, ఈ రోజు మాల పున్నమి కావడంతో విద్యార్థులు ఇంటికి వెళ్లారు అని సమాధానం ఇచ్చారు. అయితే దీనిపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ప్రభుత్వం ప్రకటించని సెలవును మీరు ఎలా ఇస్తారు పిల్లలు ప్రతిరోజూ పాఠశాలకు వచ్చి బోధన పొందాలి. మీరు ప్రోత్సహించకపోతే విద్యార్థుల చదువు ఎక్కడ నేర్చుకుంటారు అని ప్రశ్నించారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన కారణంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు శేషపాణి శర్మను సస్పెండ్ చేయాలని జిల్లా విద్యాధికారికి కలెక్టర్ ఆదేశించారు. ఉపాధ్యాయుల హాజరు పట్టికను స్వయంగా పరిశీలించారు. ప్రతి రోజు ఉపాధ్యాయులు, విద్యార్థులందరూ 100 శాతం హాజరుగా ఉండాలని స్పష్టం చేశారు. విద్యార్థులకు ఉత్తమ విద్య అందించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత అని ఆదిశగా కృషి చేసి వంద శాతం ఫలితాలు సాధించాలని కలెక్టర్ సంతోష్ కుమార్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారి రాములు, ఉపాధ్యాయులు, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.