నేడు జూబ్లీ హిల్స్ ఉపఎన్నికల నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలోని కృష్ణకాంత్ నాగర్,శ్రీనగర్ కాలనీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారిని గెలిపించాలని మార్నింగ్ వాక్ లో ప్రచారం నిర్వహించిన రాష్ట్ర ఐటీ, శాసనసభ వ్యవహారాలశాఖ మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారు, మల్కాజిగిరి మాజీ శాసనసభ్యులు మైనంపల్లి హనుమంతరావు, మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్ గార్లు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇది పేదోడి ప్రజా ప్రభుత్వం. రాష్ట్ర ప్రజలకు నిజమైన అభివృద్ధి, సంక్షేమ పథకాలు అందించే పార్టీ కేవలం కాంగ్రెస్ పార్టీనే అని తెలిపారు. గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి సారథ్యంలో అనేక సంక్షేమ పధకాలు అమలు చేస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించడానికి నవీన్ యాదవ్ గారిని బారీ మెజార్టీతో గెలిపించలని కోరారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు మహిపాల్ రెడ్డి, కిషోర్ రెడ్డి,కార్పొరేటర్స్ లక్ష్మణ్ రెడ్డి, వెంకటేష్ రెడ్డి, లక్ష్మీకాంత రెడ్డి,జితేందర్, ప్రేమ కుమార్, విజయ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నాయకులు యూత్ కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు స్థానిక ప్రజలు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొనారు.


