పున్నమి: జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పందించాలని 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు కోరారు.జీవో నం. 370 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులకు తాత్కాలిక డిప్యూటేషన్ల కై ఉపశమనం కొరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 190 ను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో 317 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 27న చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, డిప్యూటేషన్ జీవో 190 లో కూడా స్థానికత లేదనే విషయం పైన స్పందించాలని కోరారు. ఈ జీవో ద్వారా తాత్కాలిక డిప్యూటేషన్ లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ చేయబడ్డ పండిట్, పీఈటీ లకు ఈ జీవో వల్ల ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నారు. క్లియరెన్స్ వేకెన్సీ లో మాత్రమే బాధితులకు అవకాశం కల్పిస్తామని చెప్పడం తో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 317 బాధితులు అందరికీ న్యాయం జరిగేలా శాశ్వతంగా వారి సొంత జిల్లా జోన్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 317 జీవో బాధితులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు ఐలయ్య, పృథ్వి, జ్యోతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

జీవో నం.190 లో స్థానికత పై ప్రభుత్వం స్పందించాలి.. 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు… 27న చలో హైదరాబాద్కు పిలుపు..
పున్నమి: జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పందించాలని 317 ఉద్యోగ ఉపాధ్యాయ జేఏసీ చైర్మన్ టి విజయ్ కుమార్, సెక్రటరీ జనరల్ నాగేశ్వరరావు కోరారు.జీవో నం. 370 ఉద్యోగ ఉపాధ్యాయ బాధితులకు తాత్కాలిక డిప్యూటేషన్ల కై ఉపశమనం కొరకు తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం. 190 ను స్వాగతిస్తున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు సోమవారం ట్యాంక్ బండ్ అంబేద్కర్ విగ్రహం వద్ద జీవో 317 జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో 27న చలో హైదరాబాద్ పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ జీవో నెంబర్ 190 లో స్థానికతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని, డిప్యూటేషన్ జీవో 190 లో కూడా స్థానికత లేదనే విషయం పైన స్పందించాలని కోరారు. ఈ జీవో ద్వారా తాత్కాలిక డిప్యూటేషన్ లో కేవలం కొంతమందికి మాత్రమే అవకాశాన్ని కల్పించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అప్డేట్ చేయబడ్డ పండిట్, పీఈటీ లకు ఈ జీవో వల్ల ఎలాంటి లబ్ధి చేకూరడం లేదన్నారు. క్లియరెన్స్ వేకెన్సీ లో మాత్రమే బాధితులకు అవకాశం కల్పిస్తామని చెప్పడం తో కొంతమందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందన్నారు. వెంటనే ప్రభుత్వం స్పందించి 317 బాధితులు అందరికీ న్యాయం జరిగేలా శాశ్వతంగా వారి సొంత జిల్లా జోన్లకు చేర్చాలని విజ్ఞప్తి చేశారు. ఈ అంశంపై ఈ నెల 27న చలో హైదరాబాద్ కార్యక్రమాన్ని చేపట్టామని రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల నుండి 317 జీవో బాధితులు వేలాదిగా తరలిరావాలని పిలుపునిచ్చారు.ఈ కార్యక్రమంలో జేఏసీ ప్రతినిధులు ఐలయ్య, పృథ్వి, జ్యోతి, సాయి తదితరులు పాల్గొన్నారు.

