విశాఖపట్నం, (జనవరి పున్నమి ప్రతినిధి)
జీవవైవిధ్యాన్ని కాపాడుకోవాలంటే ప్రతి ఒక్కరూ పర్యావరణ విద్యను అలవర్చుకోవాలని గ్రీన్ క్లైమేట్ టీం ఎన్జిఒ వ్యవస్థాపక కార్యదర్శి జెవి రత్నం అన్నారు. మంగళవారం మద్దిలపాలెంలోని శ్రీ భావన విద్యా నికేతన్, అక్షర ఇంగ్లీష్ మీడియం పాఠశాలల్లో అంతర్జాతీయ పర్యావరణ విద్యా దినోత్సవం, అంతర్జాతీయ స్వచ్ఛ విద్యుత్తు దినోత్సవం కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ హిత జీవన విధానం అవలంబించాల్సిన అవసరం ఉందని, క్లీన్ ఎనర్జీ వినియోగంతో వాతావరణ మార్పులను నియంత్రించవచ్చని తెలిపారు. ప్రతి విద్యా సంస్థలో గ్రీన్ సోల్జర్స్ను ఏర్పాటు చేసి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, గ్రీన్ వాలంటీర్లు, విద్యార్థులు పాల్గొన్నారు.





