హైదరాబాద్ : పది మందికి సేవ చేయాలని ప్రతీ ఒక్కరికి వుంటుంది కానీ అది కొందరికే సాధ్యం అవుతుంది. అలా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇంటి లక్ష్మీ దుర్గ జీవనది ఫౌండేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించారు. సంస్థ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం నదుల వద్ద ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలు చేపట్టి, నదుల వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేయడం, ఉచితంగా మొక్కలు నాటడం, పర్యావరణ రహిత చేతి సంచులను పంపిణీ చేయడం, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం ఇలా పలు సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేస్తూన్నారు. అందులో భాగంగా జీవనది ఫౌండేషన్ రెండు సంవత్సరాల కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే అలోచన ఉన్న వ్యక్తులను తమ సంస్థలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. సేవ చేసిన వారికి తమ సంస్థలో కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందని, రాష్ట్ర అధ్యక్షులుగా జి.కృష్ణకుమారి, డా వి.బి.వి.రాయులు, సెంట్రల్ అధ్యక్షులుగా వి.శ్రీదేవిగౌడ్, పి.శివ, జనరల్ సెక్రెటరీగా హరి రఘప్రియ, ముఖ్యసలహదారులుగా పి.ధనలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి.సత్యనారాయణ, కె.సరిత, ఎం.స్వరూపారాణి, సెంట్రల్ ఉపాధ్యక్షులుగా ఎస్.రమాదేవి, కె.భార్గవీ, వై.ప్రగతి, ఎర్ర భాను, జాయింట్ సెక్రటరీలుగా ఎం.భాగ్యలక్ష్మి, డి.శారద, డి.తారభవాని, నేషనల్ మీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను నియమించడం జరిగిందన్నారు. వీరందరికి జీవనది ఫౌండేషన్ కార్యాలయంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ నియామక పత్రాలు అందజేశారు.

జీవనది ఫౌండేషన్ నూతన కార్యవర్గ సభ్యుల నియామకం
హైదరాబాద్ : పది మందికి సేవ చేయాలని ప్రతీ ఒక్కరికి వుంటుంది కానీ అది కొందరికే సాధ్యం అవుతుంది. అలా సమాజానికి ఎంతో కొంత సేవ చేయాలనే ఉద్దేశ్యంతో ఇంటి లక్ష్మీ దుర్గ జీవనది ఫౌండేషన్ అనే ఒక సంస్థను ప్రారంభించారు. సంస్థ ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించడం కోసం నదుల వద్ద ప్లాస్టిక్ నివారణ కార్యక్రమాలు చేపట్టి, నదుల వద్ద ఉన్న చెత్తను శుభ్రం చేయడం, ఉచితంగా మొక్కలు నాటడం, పర్యావరణ రహిత చేతి సంచులను పంపిణీ చేయడం, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేయడం ఇలా పలు సేవా కార్యక్రమాలు ఈ సంస్థ ద్వారా చేస్తూన్నారు. అందులో భాగంగా జీవనది ఫౌండేషన్ రెండు సంవత్సరాల కార్యవర్గ సభ్యులను నియమించారు. ఈ సందర్భంగా జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ మాట్లాడుతూ సమాజ సేవ చేయాలనే అలోచన ఉన్న వ్యక్తులను తమ సంస్థలోకి ఆహ్వానించడం జరిగిందన్నారు. సేవ చేసిన వారికి తమ సంస్థలో కార్యవర్గ సభ్యులుగా నియమించడం జరిగిందని, రాష్ట్ర అధ్యక్షులుగా జి.కృష్ణకుమారి, డా వి.బి.వి.రాయులు, సెంట్రల్ అధ్యక్షులుగా వి.శ్రీదేవిగౌడ్, పి.శివ, జనరల్ సెక్రెటరీగా హరి రఘప్రియ, ముఖ్యసలహదారులుగా పి.ధనలక్ష్మి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా డి.సత్యనారాయణ, కె.సరిత, ఎం.స్వరూపారాణి, సెంట్రల్ ఉపాధ్యక్షులుగా ఎస్.రమాదేవి, కె.భార్గవీ, వై.ప్రగతి, ఎర్ర భాను, జాయింట్ సెక్రటరీలుగా ఎం.భాగ్యలక్ష్మి, డి.శారద, డి.తారభవాని, నేషనల్ మీడియా కో-ఆర్డినేటర్ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రను నియమించడం జరిగిందన్నారు. వీరందరికి జీవనది ఫౌండేషన్ కార్యాలయంలో జీవనది ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు ఇంటి లక్ష్మీ దుర్గ నియామక పత్రాలు అందజేశారు.

