రైల్వే కోడూరు, సెప్టెంబర్ 04: అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్ పోటీలలో రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ యం.నాని ప్రథమ బహుమతిని గెలుచుకొని రూ.10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి.జగదీష్ నాల్గవ బహుమతిని సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ, “జిల్లా స్థాయిలో విద్యార్థులు సాధించిన విజయం మా కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.రమేష్, ఆర్.ఆర్.సి. కో ఆర్డినేటర్ డా.ఈ.ప్రేమలత, యన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ.శ్రావణి పాల్గొన్నారు.

జిల్లా స్థాయి 5కె రెడ్ రన్లో రైల్వే కోడూరు విద్యార్థుల ప్రతిభ
రైల్వే కోడూరు, సెప్టెంబర్ 04: అన్నమయ్య జిల్లా రాయచోటిలో జిల్లా మెడికల్ మరియు ఆరోగ్యశాఖ, ఎయిడ్స్ నివారణ సంస్థ ఆధ్వర్యంలో ఈరోజు ఉదయం నిర్వహించిన జిల్లా స్థాయి 5కె రెడ్ రన్ మారథాన్ పోటీలలో రైల్వే కోడూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. బి.కాం (సి.ఏ) విద్యార్థి శ్రీ యం.నాని ప్రథమ బహుమతిని గెలుచుకొని రూ.10,000 నగదు పురస్కారం అందుకున్నారు. అలాగే బి.ఏ తృతీయ సంవత్సరం విద్యార్థి పి.జగదీష్ నాల్గవ బహుమతిని సాధించారు. వీరిని కళాశాల ప్రిన్సిపాల్ డా.యం.భాస్కర్ రెడ్డి ప్రత్యేకంగా అభినందిస్తూ, “జిల్లా స్థాయిలో విద్యార్థులు సాధించిన విజయం మా కళాశాల గర్వకారణం. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనడానికి పూర్తి సహకారం అందిస్తాము” అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్ డా.జి.రమేష్, ఆర్.ఆర్.సి. కో ఆర్డినేటర్ డా.ఈ.ప్రేమలత, యన్.ఎస్.ఎస్. కో ఆర్డినేటర్ శ్రీ దాసరి మోషే, ఫిజికల్ డైరెక్టర్ కుమారి ఏ.శ్రావణి పాల్గొన్నారు.

