
వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకుని జిల్లా ఎస్పీ శ్రీ కె.వి. మహేశ్వర రెడ్డి, ఐపీఎస్ గారు, జిల్లా ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.
ఆ విఘ్నేశ్వరుడు, గణనాథుని ఆశీస్సులతో ప్రతి కుటుంబం సుఖశాంతులతో, ఆనందంతో, అభివృద్ధిలో ముందడుగు వేయాలని ఆకాంక్షించారు. జీవన ప్రయాణంలో ఉన్న విఘ్నాలు తొలగిపోయి విజయాలు సాధించాలని, ప్రజలందరి జీవితాల్లో సకల శుభాలు నెలకొనాలని కోరారు.
జిల్లాలో వినాయక చవితి పండుగ, వేడుకలు, గణేష్ నిమజ్జన కార్యక్రమాలు ప్రశాంతంగా, ఆనందభరితంగా నిర్వహించుకోవాలని జిల్లా ఎస్పీ విజ్ఞప్తి చేశారు. ప్రజలందరూ జిల్లా పోలీసు శాఖ జారీ చేసిన జాగ్రత్తలు, నియమ నిబంధనలు పాటిస్తూ, అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా పండుగను జరుపుకోవాలని సూచించారు.

