తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలోని ప్రత్యేక మహిళా కారాగార సూపరింటెండెంట్ సిహెచ్. వసంతకుమారి బుధవారం జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరిని మర్యాద పూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ సందర్భంగా, ఆమె మహిళా ఖైదీల కోసం నిర్వహిస్తున్న వివిధ పరివర్తన కార్యక్రమాలను కలెక్టర్ కు వివరించారు. అలాగే, ఖైదీలలో మహిళలు తయారు చేస్తున్న పలు ఉత్పత్తుల వివరాలను కూడా తెలియ చేశారు. సూపరింటెండెంట్ మహిళా ఖైదీల పరిస్థితులను పరిశీలించేందుకు కలెక్టర్ ప్రత్యేకంగా సందర్శించ వలసిందిగా అభ్యర్థించారు.


