జిల్లా అధికారులు, ప్రత్యేక అధికారులు, జోనల్ అధికారులు, రెవెన్యూ అధికారుల తో కలెక్టర్ MN హరేందిర ప్రసాద్ టెలికాన్ఫరెన్స్.
*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి *
తుఫాను అనంతరం తీసుకోవలసిన చర్యలపై అధికారులకు దిశా నిర్దేశం.
కలెక్టర్ కామెంట్స్.
పారిశుధ్యం, నీటి వనరుల క్లోరినేషన్, దెబ్బతిన్న రోడ్లపై గుంతలు పూడ్చడం, ల్యాండ్ స్లయిడింగ్ జరిగిన చోట రోడ్ ల పునరుద్ధరణ పై జోనల్ అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టండి.
తుఫాను నష్టాలను జాగ్రత్తగా అంచనా వేయండి.
పూర్తిగా ,పాక్షికంగా దెబ్బతిన్న గృహాలను నమోదు చేయండి.
పంట ,పశు నష్టం,బోట్లు నష్టం అంచనాలను తయారు చెయ్యాలి.
దెబ్బతిన్న పంచాయతీ రాజ్,R&B , మైనర్ ఇరిగేషన్, పాఠశాలల భవనాలు అంచనాలు తయారు చేయాలి.
ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిరాశ్రయులైన వారికి, తుఫాను వల్ల ఉపాధి కోల్పోయిన మత్స్యకారులను గుర్తించి పరిహారం అందించడానికి చర్యలు తీసుకోవాలి.
నష్టం అంచనాలను రెండు రోజులల్లో పూర్తి చేయాలి.
ఎలాంటి సంఘటనలు జరగకుండా క్షేత్ర స్థాయిలో ఉండి పని చేసిన అధికారులను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అభినందించారనీ చెప్పారు.
1జిల్లాలో విద్యుత్ సరఫరా లో అంతరాయం కలుగ కుండా పని చేసిన అధికారులను, ప్రత్యేక అధికారులను కలెక్టర్ అభినందించారు


