కలిగిరి మండలం జిర్రావారిపాలెం గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కోదండ రామస్వామి స్వామివారి నూతన ఆలయ నిర్మాణానికి ఈరోజు శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక పూజలు, వేద మంత్రోచ్చారణల మధ్య నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు దేవాదాయ శాఖ సహకారంతో రూ.1 కోటి నిధులు మంజూరు చేశారు. గ్రామ ప్రజల ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆలయ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కార్యక్రమంలో ఉదయగిరి ఎమ్మెల్యే కాకర్ల సురేష్, ఆ గ్రామ ప్రజలు, భక్తులు, స్థానిక నాయకులు పాల్గొన్నారు.



