ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో శ్రీకాళహస్తి పట్టణంలో ని విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు శనివారం నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 బహుళ జాతీయ కంపెనీల లో 800 లకు పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇంటర్యూ లు నిర్వహించబడునని, నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.అలాగే గతంలో కూడా అనేక పర్యాయములు శ్రీకాళహస్తిలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు.

జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించిన ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి
ఆంధ్రప్రదేశ్ నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యం లో శ్రీకాళహస్తి పట్టణంలో ని విక్రమ్ డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు శనివారం నిర్వహించనున్న జాబ్ మేళా పోస్టర్లను గురువారం స్థానిక ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి ఆవిష్కరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 14 బహుళ జాతీయ కంపెనీల లో 800 లకు పైగా ఉద్యోగాల కల్పనలో భాగంగా ఇంటర్యూ లు నిర్వహించబడునని, నియోజకవర్గం లోని నిరుద్యోగ యువతీ,యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలియజేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగాల కల్పనే కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఈ సందర్భంగా వారు తెలియజేశారు.అలాగే గతంలో కూడా అనేక పర్యాయములు శ్రీకాళహస్తిలో జాబ్ మేళాలు నిర్వహించి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించామని ఎమ్మెల్యే బొజ్జల సుధీర్ రెడ్డి తెలియజేశారు.

