*37 వార్డు , జబ్బరితోట వద్ద సామాజిక భవనాన్ని ప్రారంభించిన నగర మేయర్ శ్రీ పీలా శ్రీనివాస్ గారు, స్థానిక ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
*కూటమి ప్రభుత్వం అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించిందన్న ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ గారు*
విశాఖపట్నం పున్నమి ప్రతినిధి:-
*నియోజకవర్గంలో అన్ని వార్డులలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని తెలిపిన ఎమ్మెల్యే*
ప్రజలకు మౌలిక వసతుల కల్పనే ప్రథమ కర్తవ్యమని నగర మేయర్ పీలా శ్రీనివాసరావు పేర్కొన్నారు. ఈరోజు 37 వ వార్డు పరిధిలోని జబ్బరితోట వద్ద సుమారు 42 లక్షల జీవీఎంసీ నిధులతో నిర్మించిన సామాజిక భవనం రెండవ అంతస్తు ను దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు వంశీకృష్ణ శ్రీనివాస్ గారు, కార్పొరేటర్ చెన్న జానకిరామ్ లతో కలిసి ప్రారంభించారు
ఈ సందర్భంగా నగర మేయర్ మాట్లాడుతూ నగర ప్రజలకు మౌలిక వసతులు కల్పన ప్రధమ కర్తవ్యం అని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజలకు మౌలిక వసతుల పాటు ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తూ ప్రజలకు చేరువులో ఉంటుందన్నారు. ప్రజలకు మౌలిక వసతులు, సంక్షేమ పథకాలు అందించడంలో పార్టీలకతీతంగా అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. జబ్బర తోటలోని ప్రజల అవసరాల మేరకు సామాజిక భవనాన్ని కి అదనపు అంతస్తు నిర్మించి నేడు ప్రారంభించడం జరిగిందని తెలిపారు.
అనంతరం దక్షిణ నియోజకవర్గం శాసనసభ్యులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత విశాఖ అభివృద్ధిపై దృష్టి కేంద్రీకరించి అభివృద్ధి చేయడం జరుగుతుందన్నారు. దక్షిణ నియోజకవర్గం పరిధిలోని అన్ని వార్డులలో అభివృద్ధి పనులు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని, జబ్బరి తోటలో సామాజిక భవనాన్ని ప్రారంభించి ఇక్కడ ప్రజలకు అందించడం జరిగిందన్నారు.
ఈ కార్యక్రమంలో జోనల్ కమిషనర్ మల్లయ్య నాయుడు, జీవీఎంసీ ఉప కార్యనిర్వాహక ఇంజనీర్ వెంకటేశ్వరరావు, సహాయక ఇంజనీరు, సచివాలయం కార్యదర్శులు, జనసేన పార్టీ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ శ్రీ శివ ప్రసాద్ రెడ్డి గారు స్థానిక కూటమి నేతలు శ్రీ గరికిన రవి గారు, శ్రీ చిన్న గారు, తాతలు మాస్టర్, శ్రీ తాతాజీ గారు, శ్రీ రమేష్ గారు, శ్రీ సురేష్ గారు, శ్రీ తాతారావు గారు, పెద్దయ్య గారు, కే ఎఫ్ రాజు, అయ్యప్ప గారు, పలువురు వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.


