తోటంబేడు, మార్చి 26 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలం, పెన్నాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు (ఉద్యమి సభ్యత్వ దారుడు) వెట్టిచెర్ల సుబ్బరాయులు ఆకస్మిక మరణం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నిబద్ధత కలిగిన జనసైనికుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబ్బరాయులు మృతి పార్టీకి తీరని లోటని స్థానిక నాయకులు పేర్కొన్నారు. సుబ్బరాయులు మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన జనసేన పార్టీ నాయకులు, పేట సోదరులు తన మిత్రబృందంతో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కష్ట సమయంలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, తక్షణ సహాయం కింద రూ. 5,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యుడిగా జనసేన గౌరవిస్తుందని సుబ్బరాయులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని వారి కుటుంబానికి భవిష్యత్తులోనూ పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్థులు పాల్గొని సుబ్బరాయులుకు నివాళులర్పించారు.

జనసైనికుడి కుటుంబానికి జనసేన భరోసా- కార్యకర్తమృతికి సంతాపం, తక్షణ ఆర్థిక సాయం
తోటంబేడు, మార్చి 26 (పున్నమి న్యూస్): తొట్టంబేడు మండలం, పెన్నాలపాడు గ్రామానికి చెందిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యుడు (ఉద్యమి సభ్యత్వ దారుడు) వెట్టిచెర్ల సుబ్బరాయులు ఆకస్మిక మరణం పట్ల జనసేన పార్టీ తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. నిబద్ధత కలిగిన జనసైనికుడిగా పార్టీ బలోపేతానికి కృషి చేసిన సుబ్బరాయులు మృతి పార్టీకి తీరని లోటని స్థానిక నాయకులు పేర్కొన్నారు. సుబ్బరాయులు మరణవార్త తెలిసిన వెంటనే స్పందించిన జనసేన పార్టీ నాయకులు, పేట సోదరులు తన మిత్రబృందంతో కలసి బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కష్ట సమయంలో పార్టీ ఎప్పుడూ అండగా ఉంటుందని భరోసా కల్పిస్తూ, తక్షణ సహాయం కింద రూ. 5,000 నగదును కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు మాట్లాడుతూ.. పార్టీ కోసం కష్టపడే ప్రతి కార్యకర్తను ఒక కుటుంబ సభ్యుడిగా జనసేన గౌరవిస్తుందని సుబ్బరాయులు ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని వారి కుటుంబానికి భవిష్యత్తులోనూ పార్టీ తరఫున అవసరమైన సహకారం అందిస్తామని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన నాయకులు, జనసైనికులు, గ్రామస్థులు పాల్గొని సుబ్బరాయులుకు నివాళులర్పించారు.

