* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లోని గణపతి పురం గిరిజన కాలనీ పర్యటించడం జరిగింది, అక్కడున్న గిరిజనులు దాదాపుగా 30 నుండి 35 సంవత్సరాలుగా నివాసముంటున్నామని ఇంకా గుడిసెలలోనే జీవనం సాగిస్తున్నామని తెలపడం జరిగింది, అంతేకాకుండా గత ప్రభుత్వంలో 30 కుటుంబాలకు గాను కేవలం 5 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలిచ్చారని కనీసం ఆ ఇంటి స్థలం ఎక్కడ ఉన్నది ఆ స్థలం కూడా మాకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు, మిగిలిన 25 కుటుంబాల గురించి అసలు ఆలోచన చేయలేదని చెప్పడం జరిగింది, ఎన్నో సంవత్సరాలుగా అందరూ వస్తున్నారు పోతున్నారు మా సమస్యలు తెలుసుకుంటున్నారే కానీ పరిష్కరించట్లేదని కనీసం మీరు అయిన మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు, కచ్చితంగా మీ సమస్యలన్నిటిని స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగే లాగా కృషి చేస్తామని తెలపడం జరిగింది.
వీధి లైట్లు కూడా లేవని తెలపడంతో వెంటనే సర్పంచ్ గారికి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది, వారం రోజుల లోపు ఏర్పాటు చేస్తామని అతను చెప్పడం జరిగింది.
ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, తేజ, మనీ, ప్రదీప్ కుమార్, కల్లిపూడి వెంకటేష్, దినేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

జనసేన పర్యటనలో గిరిజనుల సమస్యలు తెలుసుకుంటున్న పేట బ్రదర్స్ మిత్రబృందం*
* జనసేన పర్యటనలో భాగంగా తొట్టంబేడు మండలం చిట్టత్తూరు పంచాయతీ లోని గణపతి పురం గిరిజన కాలనీ పర్యటించడం జరిగింది, అక్కడున్న గిరిజనులు దాదాపుగా 30 నుండి 35 సంవత్సరాలుగా నివాసముంటున్నామని ఇంకా గుడిసెలలోనే జీవనం సాగిస్తున్నామని తెలపడం జరిగింది, అంతేకాకుండా గత ప్రభుత్వంలో 30 కుటుంబాలకు గాను కేవలం 5 కుటుంబాలకు మాత్రమే ఇంటి పట్టాలిచ్చారని కనీసం ఆ ఇంటి స్థలం ఎక్కడ ఉన్నది ఆ స్థలం కూడా మాకు తెలియపరచలేదని ఆవేదన వ్యక్తం చేశారు, మిగిలిన 25 కుటుంబాల గురించి అసలు ఆలోచన చేయలేదని చెప్పడం జరిగింది, ఎన్నో సంవత్సరాలుగా అందరూ వస్తున్నారు పోతున్నారు మా సమస్యలు తెలుసుకుంటున్నారే కానీ పరిష్కరించట్లేదని కనీసం మీరు అయిన మా సమస్యలను పరిష్కరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు, కచ్చితంగా మీ సమస్యలన్నిటిని స్థానిక శాసనసభ్యులు శ్రీ బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి గారి దృష్టికి మరియు గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి వర్యులు శ్రీ కొణిదల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకొని వెళ్లి ఈ కూటమి ప్రభుత్వంలో మీకు న్యాయం జరిగే లాగా కృషి చేస్తామని తెలపడం జరిగింది. వీధి లైట్లు కూడా లేవని తెలపడంతో వెంటనే సర్పంచ్ గారికి ఫోన్ చేసి సమాచారం అందించడం జరిగింది, వారం రోజుల లోపు ఏర్పాటు చేస్తామని అతను చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు పేట చంద్రశేఖర్, పేట చిరంజీవి, గంధం శ్రీను, తేజ, మనీ, ప్రదీప్ కుమార్, కల్లిపూడి వెంకటేష్, దినేష్, గోపి, తదితరులు పాల్గొన్నారు.

