విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి):
ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనున్నారు. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలను కేంద్రంగా చేసుకుని మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ నగరంలో జనవరి 24 నుంచి 31 వరకు, అనకాపల్లి ప్రాంతంలో జనవరి 29, 30 తేదీల్లో, అరకు లోయలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తుండగా, దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారోత్సవాలు, సాహస క్రీడలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.



