ఏడునూతుల, పున్నమి ప్రతినిధి:
జడ్పిహెచ్ఎస్ ఏడునూతులలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. తర్వాత విద్యార్థులు ఉపాధ్యాయులందరినీ ఘనంగా పూలమాలలు, కిరీటాలు, పూల బొకేలతో సన్మానించారు.
ఈ సందర్భంగా ఉపాధ్యాయులందరూ ప్రసంగించి విద్యార్థులకు ప్రేరణనిచ్చారు. గురువు జీవనంలో వెలుగు నింపే దీపస్తంభం అని, క్రమశిక్షణ, కష్టపడి చదువుకోవడం, మానవీయ విలువలు పాటించడం ద్వారానే ఉన్నత శిఖరాలను అధిరోహించవచ్చని హితబోధ చేశారు.
తర్వాత విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు—నృత్యాలు, పాటలు, ప్రసంగాలు—ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి.
ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్ కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొన్నారు.


