కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 4: జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ముందుగా రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా మండల ఆఫీసుకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అని అన్నారు
తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం. జరిగిందని జగ్గంపేట నియోజకవర్గంలో 1688 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఇంకా 139 మంది అనర్హుల జాబితాలో ఉన్నారని వారికి కూడా న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్పెషలాఫీసర్సత్యనారాయణకు నవీన్ తెలియజేశారు.ఆటో, క్యాబ్, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకొంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందని నవీన్ తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయ అందించేందుకు సహాయక కేంద్రం మండల ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయం అందించేందుకు నేనెప్పుడూ ముందుంటానని తెలియజేశారు. నియోజకవర్గం అని ఆటో డ్రైవర్ల అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ద్వారా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

జగ్గంపేటలోఆటో డ్రైవర్ల సేవలో పథకం ప్రారంభించిన జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్.
కాకినాడ జిల్లా జగ్గంపేట అక్టోబర్ 4: జగ్గంపేట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు, జగ్గంపేట నియోజకవర్గం అభివృద్ధి కమిటీ చైర్మన్ జ్యోతుల నవీన్ ప్రారంభించారు. ముందుగా రావులమ్మ నగర్ లోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నుండి ఆటో డ్రైవర్లతో కలిసి జ్యోతుల నవీన్ ఆటో నడుపుతూ ఆటో ర్యాలీగా మండల ఆఫీసుకి చేరుకున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన సభకు జగ్గంపేట మండల టిడిపి అధ్యక్షులు జీనుమణి బాబు అధ్యక్షత వహించగా ముఖ్యఅతిథిగా హాజరైన జ్యోతుల నవీన్ ఆటో డ్రైవర్లకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నవీన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అమరావతిలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించారు. అని అన్నారు తొలి ఏడాది రాష్ట్రవ్యాప్తంగా 2,90,669 మంది డ్రైవర్లకు ఆర్థిక సాయం. జరిగిందని జగ్గంపేట నియోజకవర్గంలో 1688 మందికి ఈ పథకం ద్వారా లబ్ధి చేకూరిందని ఇంకా 139 మంది అనర్హుల జాబితాలో ఉన్నారని వారికి కూడా న్యాయం చేసే విధంగా చర్యలు చేపట్టాలని స్పెషలాఫీసర్సత్యనారాయణకు నవీన్ తెలియజేశారు.ఆటో, క్యాబ్, ట్యాక్సీలను సొంతంగా కలిగి ఉండి.. వాటిని నడుపుకొంటూ కుటుంబాలను పోషించుకునే డ్రైవర్లకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయాన్ని కూటమి ప్రభుత్వం అందించడం జరుగుతుందని నవీన్ తెలియజేశారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయ అందించేందుకు సహాయక కేంద్రం మండల ఆఫీసులో ఏర్పాటు చేయడం జరిగింది అని అన్నారు. ఆటో డ్రైవర్లకు అన్ని విధాల సహాయం అందించేందుకు నేనెప్పుడూ ముందుంటానని తెలియజేశారు. నియోజకవర్గం అని ఆటో డ్రైవర్ల అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వ ద్వారా కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, అధిక సంఖ్యలో ఆటో డ్రైవర్లు పాల్గొన్నారు.

