చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవానికి హృదయపూర్వక ఆహ్వానం
కాకినాడ పాత బస్ స్టాండ్ సమీపంలోని డా. బి.ఆర్. అంబేద్కర్ భవన్ లో జరగబోయే చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ 8వ వార్షికోత్సవం సందర్భంగా మన అందరినీ సాదరంగా ఆహ్వానిస్తున్నాము.
ఈ కార్యక్రమం 2025 నవంబర్ 8వ తేదీ, శనివారం ఉదయం 9:30 గంటలకు ఘనంగా ప్రారంభమవుతుంది.
ఉదయం 9:30 గంటలకు ప్రారంభోత్సవం,
10:00 గంటలకు సాంస్కృతిక కార్యక్రమాలు,
10:30 గంటలకు అతిథులకు ఆహ్వానం, ప్రార్థన మరియు జ్యోతి ప్రజ్వలన,
11:00 గంటలకు చేయూత సంస్థ ద్వారా లబ్ధిపొందిన వారి స్పందనలు,
11:30 గంటలకు ప్రముఖ అతిథుల సందేశాలు,
తదుపరి 12:00 గంటలకు విద్యా, వైద్యం మరియు ఉపాధి కల్పనకై లబ్ధిదారులకు చెక్కులు అందజేత కార్యక్రమం జరుగుతుంది.
కార్యక్రమానంతరం విందు ఏర్పాటు చేయబడింది.
ఈ సందర్భం లో శ్రీ N. రఘురామయ్యగారు (SA, MPPS అప్పనపల్లి) మరియు శ్రీ K. శ్రీనివాసరావు గారు (SA, ZPHS గోగన్నమటం) చేయూత అవార్డుకు ఎంపిక కావడం గర్వకారణం. వారికి హృదయపూర్వక అభినందనలు తెలుపుతున్నాము.
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయులు, ఆదర్శ రైతులు మరియు సమాజసేవకులు సన్మానించబడనున్నారు. ఈ పుణ్య సందర్భంలో తామందరూ హాజరై కార్యక్రమాన్ని జయప్రదం చేయగలరని కోరుచున్నాము.
ఆహ్వానించువారు:
యమ్.ఎ. ఆలీమ్, ప్రధాన కార్యదర్శి 9989951788
డా. యమ్. రవి కుమార్, వ్యవస్థాపక అధ్యక్షులు 90306 11400
మరియు చేయూత సంస్థ కార్యవర్గ సభ్యులు
చేయూత స్వచ్ఛంద సేవా సంస్థ – అవసరంలో ఉన్నవారికి చేయూతగా నిలుస్తూ, సమాజ upliftment దిశగా అష్టదిక్కులా వెలుగులు నింపుతూ ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మనమందరం భాగస్వాములమవుదాం!


