చిట్వేలు సెప్టెంబర్ 16(పున్నమి ప్రతినిధి)
చిట్వేలు మండలంలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు హయాంలో ఏర్పాటు చేసిన చెత్త నుంచి సంపద కేంద్రాలు ప్రస్తుతం నిరుపయోగంగా మారాయి. ఈ కేంద్రాల ద్వారా చెత్తను ఎరువుగా మార్చి పంచాయతీలకు ఆదాయం సమకూర్చే లక్ష్యంతో వీటిని ప్రారంభించారు. అయితే, అధికారంలోకి వచ్చిన వైసీపీ ప్రభుత్వం వీటిని పట్టించుకోకపోవడంతో అవి మూతపడ్డాయి. స్థానిక ప్రజలు మంగళవారం ఈ కేంద్రాలను పునరుద్ధరించి, తిరిగి ఉపయోగంలోకి తీసుకురావాలని కోరుతున్నారు.


