Monday, 8 December 2025
  • Home  
  • చిట్వేల్ మండలం మలేమార్పూరం పంచాయతీ నందు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి
- అన్నమయ్య

చిట్వేల్ మండలం మలేమార్పూరం పంచాయతీ నందు డోర్ టు డోర్ కార్యక్రమం నిర్వహించిన టీడీపీ పార్టీ ఇంచార్జ్ కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి

చిట్వేలి మండలం పున్నమి ప్రతినిధి జూలై 20 మలేమార్పూరం గ్రామం లొ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై స్పందించిన కూడా చైర్మన్ రూపానంద రెడ్డి చిట్వేలు మండలంలోని మలేమార్పూరు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం భాగంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందిస్తున్న పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు. ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో రూపానంద రెడ్డి అభినందిస్తూ తమ మద్దతును వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, వృద్ధాప్య పెన్షన్లు, విద్యుత్ సదుపాయాలు వంటి సమస్యలపై ప్రజలు ప్రస్తావించగా, ఆయా అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ప్రజల మద్దతుతో తన ప్రయాణం విజయవంతంగా సాగుతోందని, ప్రతి ఓటును నమ్మకంగా నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. గ్రామస్తులు పార్టీపై చూపుతున్న విశ్వాసం తమకు కొత్త శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

చిట్వేలి మండలం పున్నమి ప్రతినిధి జూలై 20
మలేమార్పూరం గ్రామం లొ డోర్ టు డోర్ కార్యక్రమంలో పాల్గొని ప్రజల సమస్యలపై స్పందించిన కూడా చైర్మన్ రూపానంద రెడ్డి చిట్వేలు మండలంలోని మలేమార్పూరు గ్రామంలో సుపరిపాలనకు తొలి అడుగు కార్యక్రమం భాగంగా డోర్ టు డోర్ ప్రచారాన్ని రైల్వే కోడూరు నియోజకవర్గ టిడిపి పార్టీ ఇంచార్జ్ మరియు కూడా చైర్మన్ ముక్కా రూపానంద రెడ్డి నిర్వహించారు. గ్రామంలో ప్రతి ఇంటిని సందర్శించి ప్రజల సమస్యలు తెలుసుకొని, వాటి పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని హామీ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలం గడుస్తున్న నేపథ్యంలో సుపరిపాలనకు తొలి అడుగు లో భాగంగా ప్రభుత్వం తరఫున ప్రజలకు అందిస్తున్న పలు రకాల అభివృద్ధి కార్యక్రమాలపై ఆయన చర్చించారు.
ఈ సందర్భంగా స్థానికులు పెద్ద సంఖ్యలో రూపానంద రెడ్డి అభినందిస్తూ తమ మద్దతును వ్యక్తం చేశారు. గ్రామంలో తాగునీరు, రహదారులు, వృద్ధాప్య పెన్షన్లు, విద్యుత్ సదుపాయాలు వంటి సమస్యలపై ప్రజలు ప్రస్తావించగా, ఆయా అంశాలపై ప్రభుత్వం దృష్టి సారించేలా చేస్తానని ఆయన హామీ ఇచ్చారు.ప్రజల మద్దతుతో తన ప్రయాణం విజయవంతంగా సాగుతోందని, ప్రతి ఓటును నమ్మకంగా నిలబెట్టుకునే విధంగా పనిచేస్తామని ముక్కా రూపానంద రెడ్డి తెలిపారు. గ్రామస్తులు పార్టీపై చూపుతున్న విశ్వాసం తమకు కొత్త శక్తిని ఇస్తుందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు,గ్రామ ప్రజలు, అభిమానులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.