చిట్వేల్ మండలం మారటిపల్లి గ్రామానికి చెందిన వలసాని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులైన వలసాని గుండాలయ్య కుమారుడు వలసాని గోపాల్ చిట్వేల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు డెలివరీ టేబుల్ను విరాళంగా అందజేశారు. 2019 నుంచి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలకు వచ్చే వారికి తాగునీరు, జ్యూస్, అల్పాహారం అందజేస్తూ సేవాభావం చాటుకుంటున్నారు. అలాగే కరోనా కాలంలో వేల సంఖ్యలో సిరంజీలు, శానిటేషన్ సామగ్రి, మాస్కులు విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను కూడా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ, అవసరమైనప్పుడల్లా చిన్నా–పెద్దా సహాయాలు అందిస్తూ ఆసుపత్రికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వలసాని గోపాల్కు ఆసుపత్రి సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

చిట్వేల్ పీహెచ్సీకి డెలివరీ టేబుల్ విరాళం
చిట్వేల్ మండలం మారటిపల్లి గ్రామానికి చెందిన వలసాని స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులైన వలసాని గుండాలయ్య కుమారుడు వలసాని గోపాల్ చిట్వేల్ ప్రాధమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)కు డెలివరీ టేబుల్ను విరాళంగా అందజేశారు. 2019 నుంచి ప్రతి నెల 9వ తేదీన గర్భిణీ స్త్రీల ఆరోగ్య పరీక్షలకు వచ్చే వారికి తాగునీరు, జ్యూస్, అల్పాహారం అందజేస్తూ సేవాభావం చాటుకుంటున్నారు. అలాగే కరోనా కాలంలో వేల సంఖ్యలో సిరంజీలు, శానిటేషన్ సామగ్రి, మాస్కులు విరాళంగా ఇచ్చారు. ఆసుపత్రిలో రోగులు కూర్చోవడానికి సిమెంట్ బెంచీలను కూడా ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా డాక్టర్ అన్సారీ మాట్లాడుతూ, అవసరమైనప్పుడల్లా చిన్నా–పెద్దా సహాయాలు అందిస్తూ ఆసుపత్రికి అండగా నిలుస్తున్నారని ప్రశంసించారు. వలసాని గోపాల్కు ఆసుపత్రి సిబ్బంది తరఫున కృతజ్ఞతలు తెలియజేశారు.

