చిట్వేలి ఆగస్టు (పున్నమి ప్రతినిధి)
అన్నమయ్య జిల్లా చిట్వేల్ పరిధిలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద వీధి లైట్లు అనేక రోజులుగా వెలగకపోవడంతో స్థానిక ప్రజలు తీవ్ర అసౌకర్యానికి గురవుతున్నారు. రాత్రి సమయంలో చీకటితో వాహనదారులు, పాదచారులు ప్రమాదాల బారిన పడే పరిస్థితి నెలకొంది.
గ్రామ ప్రజలు పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం పై ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చీకట్లో దొంగతనాలు, అవాంఛనీయ సంఘటనలు జరిగే ప్రమాదం ఉందని నివాసులు హెచ్చరిస్తున్నారు.
స్థానికులు వెంటనే వీధి లైట్లు మరమ్మతు చేసి వెలిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులు కోరుతున్నారు.


