Monday, 23 March 2026
  • Home  
  • చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు
- అన్నమయ్య

చిట్వేలి మండలంలో గ్రామసభల ప్రారంభం – ప్రజలే ప్రణాళికల శిల్పులు

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు. సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు. మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం 2026 – 27 ఆర్థిక సంవత్సర ప్రణాళికలో భాగంగా చిట్వేలి మండలంలోని అన్ని గ్రామపంచాయతీలలో మొదటి గ్రామసభలను అక్టోబర్ 3న నిర్వహించనున్నట్లు ఏపీవో నాగరాజ్ తెలిపారు.
సర్పంచ్ అధ్యక్షతన, పంచాయతీ సెక్రటరీ మరియు ఫీల్డ్ అసిస్టెంట్ ఆధ్వర్యంలో జరిగే ఈ గ్రామసభల్లో ప్రజాప్రతినిధులు, అధికారులు, ఉపాధి శ్రామికులు, స్వయం సహాయక సంఘాల ప్రతినిధులు, గ్రామస్థులు పాల్గొనాలని ఆయన కోరారు.
మొత్తం 21 గ్రామపంచాయతీలలో రెండు టీములుగా విభజించి గ్రామసభలు నిర్వహించనున్నట్లు ఏపీవో పేర్కొన్నారు. ఈ సమావేశాల ద్వారా రాబోయే ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఉపాధి పనుల ప్రణాళికను సిద్ధం చేసి, ప్రజల అవసరాలకు అనుగుణంగా పనులు చేపట్టేలా చర్యలు తీసుకోనున్నట్లు వివరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.