శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించిన ‘కహానియన్ క క్యారవన్ (కథల ప్రయాణం) కార్యక్రమం కనువిందుగా సాగింది. నర్సరీ నుండి PP2 తరగతుల వరకు మొత్తం 42 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు.చిన్న వయస్సులోనే వేదికపై నిలబడి నీతికథలు, జంతువుల కథలు మరియు ప్రేరణాత్మక కథలను చిన్నారులు ముద్దుగా వినిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కథ చెప్పే తీరు, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ మరియు వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రాతిపదికగా తీసుకుని న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. ఏజిమ్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ చూడామణి, ఆర్.ఐ కిరణ్, ఈ-కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ మఫ్రీన్ పాల్గొని చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు సింధూజ, మల్లిక, ప్రభావతి, అరుణ, వెంకటలక్ష్మి, చందన, మమతలతో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

చిచ్చరపిడుగుల ‘కథల’ లోకం-నారాయణ పాఠశాలలో ఘనంగా కథల పోటీలు.
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, ఫిబ్రవరి 26: శ్రీకాళహస్తి పట్టణంలోని నారాయణ ఇంగ్లీష్ మీడియం పాఠశాల ఆధ్వర్యంలో విద్యార్థులలో సృజనాత్మకతను వెలికితీసేందుకు నిర్వహించిన ‘కహానియన్ క క్యారవన్ (కథల ప్రయాణం) కార్యక్రమం కనువిందుగా సాగింది. నర్సరీ నుండి PP2 తరగతుల వరకు మొత్తం 42 మంది చిన్నారులు ఈ పోటీల్లో పాల్గొని తమ వాక్చాతుర్యాన్ని చాటుకున్నారు.చిన్న వయస్సులోనే వేదికపై నిలబడి నీతికథలు, జంతువుల కథలు మరియు ప్రేరణాత్మక కథలను చిన్నారులు ముద్దుగా వినిపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. కథ చెప్పే తీరు, భావ వ్యక్తీకరణ, ఉచ్చారణ మరియు వారు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ప్రాతిపదికగా తీసుకుని న్యాయనిర్ణేతలు విజేతలను ఎంపిక చేశారు. ఏజిమ్ శ్రీనివాసులు, కోఆర్డినేటర్ చూడామణి, ఆర్.ఐ కిరణ్, ఈ-కిడ్స్ వైస్ ప్రిన్సిపల్ మఫ్రీన్ పాల్గొని చిన్నారులను అభినందించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్ ఈశ్వరయ్య మాట్లాడుతూ.. చిన్నప్పటి నుంచే విద్యార్థుల్లో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు ఎంతో దోహదపడతాయని, భవిష్యత్తులో మరిన్ని సృజనాత్మక పోటీలు నిర్వహిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీచర్లు సింధూజ, మల్లిక, ప్రభావతి, అరుణ, వెంకటలక్ష్మి, చందన, మమతలతో పాటు పెద్ద సంఖ్యలో తల్లిదండ్రులు పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.

